GST ITC Fraud in Jagtial: సినీహీరో రామ్ నటించిన 'రెడీ' మూవీలోని ఓ కామెడీ సన్నివేశంలో పన్నులు ఎగవేత కోసం అనాథశ్రమం, అందులో పిల్లలు వారికి భోజనం తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పగా, ఇంత మంచి పని చేస్తున్నామా అనే లోపు అవి కేవలం పేపర్ పైన మాత్రమే ఉంటాయి, నిజ జీవితంలో ఉండవు అనగానే అందరు షాక్ అవుతాం. ఇలా కూడా మోసం చేస్తారా అని ఆలోచనలో పడతాం కదా! సరిగ్గా అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో జరిగింది. ఓ జీఎస్టీ ప్రాక్టీషనర్(GST Practitioner Fraud) తన దగ్గర ఉన్న సమాచారంతో పేపర్పైనే లావాదేవీలు నిర్వహించి ఏకంగా రూ.40 కోట్లు కొట్టేసినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ రకంగా కూడా మోసం చేస్తున్నారని షాక్ అవుతున్నారు.
GST Practitioner Fraud in Jagtial: జీఎస్టీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాలలో ఓ జీఎస్టీ ప్రాక్టీషనర్ పలు సంస్థల వ్యాపార లావాదేవీలను జీఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో కొందరు వ్యాపారస్థులు వివిధ కారణాలతో తమ కార్యకలాపాలను పూర్తిగా మూసి వేశారు. వారికి సంబంధించిన జీఎస్టీలైసెన్స్ వివరాలతో(Details of GST Licence) పాటు ఆ సంస్థలకు చెందిన మరింత సమాచారం ప్రాక్టీషనర్ వద్ద ఉండిపోయింది. ఇదే సరైన అవకాశంగా తీసుకుని కొత్త తరహా దోపిడీకి ఆ ప్రాక్టీషనర్ తెరతీశారు.
Latest Financial Fraud in Telangana : వ్యాపారాలన్ని పూర్తిగా మూసివేసిన సంస్థలకు సంబంధించిన పాన్ నంబర్లు, జీఎస్టీ లైసెన్స్ వివరాలు, ఇతరత్రా వివరాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే పేపర్పైనే లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తప్పుడు పత్రాలను జీఎస్టీ(GST) వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ క్రెడిట్ను ఇతర వ్యాపార సంస్థలకు పంపిణీ చేశారు. ఆయా సంస్థలు ఈ క్రెడిట్ను వాడుకొని జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయి. ఆయా సంస్థల నుంచి ఈ జీఎస్టీ ప్రాక్టీషనర్ నగదు రూపంలో తీసుకున్నారు.