జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని కొనరావుపేట్ గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన కొండ్రికర్ల గంగపుత్ర మత్స్య సొసైటీ సభ్యులను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని గంగపుత్ర సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గంగపుత్ర యువకులను తీవ్రంగా కొట్టి కిడ్నాప్ చేసిన క్రమంలో నిందితుల చెర నుంచి రమేశ్ అనే యువకుడు తప్పించుకున్నాడు. గణేశ్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొడుతూ భయాందోళనకు గురి చేసినట్లు రమేశ్ మిగతా సభ్యులకు చెప్పారు.
స్పందించిన సర్పంచ్..
విషయం తెలుసుకున్న కోనరావుపేట్ గంగపుత్ర సంఘం సభ్యులు గ్రామ సర్పంచ్ మురళి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ మురళి వెంటనే పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. అనంతరం పోలీసులతో కలిసి కోనరావుపేట్ గ్రామస్థులతో కలిసి కొండ్రికర్ల గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాకతో కిడ్నాపర్లు గణేశ్ను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి లొంగిపోయారు.