తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతుల ధర్నా - muthyampet sugarcane factory news

జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. మెట్‌పల్లి మండలం మారుతీనగర్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమను తెరిపించాలంటూ డిమాండ్‌ చేశారు.

Farmers protest
మారుతీనగర్‌ వద్ద రైతుల ఆందోళన

By

Published : Apr 5, 2021, 10:55 AM IST

Updated : Apr 5, 2021, 11:55 AM IST

మారుతీనగర్‌ వద్ద రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు చెరుకు రైతులు ఆందోళన బాటపట్టారు. మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన అన్నదాతలు మెట్‌పల్లి మండలం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతల ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి.. ధర్నా విరమింపజేశారు. రాకపోకలను పునరుద్ధరించారు.

ఇదీ చూడండి: సాగర్ ఉపఎన్నిక బరిపై.. యువత గురి

Last Updated : Apr 5, 2021, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details