మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రధాన రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.
మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు - జగిత్యాల జిల్లాలో రైతుల ా
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతన్నలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
![మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు Farmers demand to bur popcorn immedietly in sale counters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9417050-516-9417050-1604405890963.jpg)
మక్కలు కొనుగోలు చేయాలంటూ రహదారిపై బైఠాయింపు
నిబంధనల పేరిట అధికారులు తక్కువ మొత్తంలో మక్కలు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతన్నలు హెచ్చరించారు.