పసుపు ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం నాడు క్వింటా ధర రూ. 10,220 పలికింది. మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే రూ. 1,311 అధికంగా ధర పలకడంతో రైతులు ఆనందంతో ఉన్నారు.
మెట్పల్లి మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా జరుగుతున్న పసుపు కొనుగోళ్లను వ్యాపారులు వారికి నచ్చిన ధరకు సొంతం చేసుకుంటున్నారు. రంజిత్ అనే రైతు వద్ద నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారి క్వింటాలుకు రూ. 10,200 వెచ్చించి కొనుగోలు చేశారు. కాడిరకం రూ. 10200, గోలరకం రూ. 7,777, చూరరకం రూ 6, 416 ధర పలుకుతోంది.