జగిత్యాల జిల్లాలో బుధవారం కొత్తగా ఎనిమిది కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యయి. ముంబయి నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు. జగిత్యాలలో ఒకరికి, వెల్గటూరు మండలంలో ముగ్గురు, బుగ్గారం, కోరుట్ల మండలాల్లో ఇద్దరి చొప్పున కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీకి తరలిస్తున్నారు.
జగిత్యాలలో కొత్తగా 8 కొవిడ్ పాజిటివ్ కేసులు
జగిత్యాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగూనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 23 చేరింది.
జిల్లాలో ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా.. కొత్తగా నమోదైన వాటితో కలుపుకుని బాధితుల సంఖ్య 23కు చేరింది. వారిలో ముగ్గురు వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం 20 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాలో ఒకేసారి 8 కేసులు నమోదవ్వడం వల్ల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుల ప్రాంతాల్లో శానిటైజేషన్, ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఆదేశించారు.
ఇదీ చూడండి :పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్ ట్రైబ్యునల్ స్టే