తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతకై చెత్తబుట్టల పంపిణీ - మున్సిపల్​ ఛైర్​పర్సన్​ సుజాత

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ సుజాత తెలిపారు. ప్రజలు తడిపొడి చెత్తలను వేరుచేసే విధంగా చెత్తబుట్టలను పంపిణీ చేశారు.

dust bins distribution at jagityala district
పరిసరాల పరిశుభ్రతకై చెత్తబుట్టల పంపిణీ

By

Published : Mar 19, 2020, 8:05 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరకుండా చేసుకోవచ్చని మున్సిపల్​ ఛైర్​పర్సన్ సుజాత తెలిపారు. పురపాలిక పరిధిలోని పలు వార్డుల్లో పరిశుభ్రత కోసం ప్రజల నుంచి తడిపొడి చెత్తను సేకరించేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.

అనంతరం కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలోనే బయట తిరగాలని.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని ఆమె సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ముఖానికి మాస్కు ధరించాలని సూచించారు.

పరిసరాల పరిశుభ్రతకై చెత్తబుట్టల పంపిణీ

ఇదీ చదవండి:8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details