తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్కల దాడి.. 11 మేకలు మృతి

ఈ మధ్య వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మొన్న మేడ్చల్​ జిల్లాలో ఓ బాలున్ని తీవ్రంగా గాయపరిచాయి. తాజాగా జగిత్యాల జిల్లా కొండాపూర్​లో శునకాలు మేకలపై దాడి చేశాయి. ఈ  ఘటనలో 11 మేకలు మృతి చెందాయి.

By

Published : Jun 9, 2019, 12:58 PM IST

దాడిలో చనిపోయిన మేకలు

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్​లో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఈ ఘటనలో గంగావేణి చిన్నగంగారాం అనే రైతుకు చెందిన 11 మేకలు మృత్యవాత పడ్డాయి. మేకల మృతితో రైతుకు 80 వేల వరకు నష్టం వాటిల్లింది. గతంలోనూ మనుషులపై కూడా శునకాలు దాడి చేశాయని... కుక్కల బెడదనుంచి తప్పించాలని బాధితులు కోరుతున్నారు.

కుక్కల దాడి.. 11 మేకలు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details