తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురిలో బీభత్సం సృష్టించిన దొంగలు - chori

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు బీభత్సం సృష్టించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ధర్మపురిలో బీభత్సం సృష్టించిన దొంగలు

By

Published : May 15, 2019, 3:48 AM IST

ధర్మపురిలో బీభత్సం సృష్టించిన దొంగలు

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్ళలోకి చొరబడి బీరువాలు పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. తాళం వేసి వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు సారగమ్మ వీధిలోని వొజ్జల సీతారామ శాస్త్రి ఇంట్లో ఐదు లక్షల నగదు, 11 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చిపిరిశెట్టి జనార్దన్ ఇంట్లో లక్ష డెబ్భై వేల నగదును దొంగిలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్​టీం సాయంతో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details