తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లి ఆలయంలో హనుమాన్​ చాలీసా పారాయణం - మెట్​పల్లి ఆలయంలో పూజలు

హనుమాన్​ మండలదీక్ష భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

Hanuman Chalisa at Metpally Temple
మెట్​పల్లి ఆలయంలో ఆంజనేయస్వామికి పూజలు

By

Published : Mar 27, 2021, 12:27 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కాశీబాగ్ ఆంజనేయస్వామికి మండలదీక్ష భక్తులు అభిషేకాలు నిర్వహించారు. వేకువ జామున నుంచే స్వామివారికి పంచామృతాభిషేకం, ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు.

వెయ్యి కమల పుష్పాలతో ఆంజనేయస్వామిని అలంకరించారు. మండలదీక్ష భక్తులు భజనలు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం, అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

ఇదీ చూడండి:మళ్లీ విజృంభిస్తున్న కరోనా... తాజాగా 495 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details