జగిత్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 308 కేసులు రాగా.. గత నాలుగు రోజులుగా రెండు వందలకుపైగా మందికి వైరస్ సోకింది. ఈ నాలుగు రోజుల్లోనే 1040 కేసులు నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2580కి చేరాయి.
జగిత్యాల జిల్లాలో భారీగా కరోనా కేసులు
జగిత్యాల జిల్లాలో కొత్తగా 308 కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లోనే 1040 మందికి వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో భారీగా కరోనా కేసులు
మొత్తం 18 మంది కొవిడ్తో మృతి చెందారు. కరోనా బారిన పడినవారిలో ఎక్కువ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పత్రిక విలేకరులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసులు పెరిగి పోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!