జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత పది రోజులుగా రోజు 600కుపైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 625 కేసులు నమోదు కాగా 17 మంది మృతి చెందారు.
జగిత్యాల జిల్లాలో ఒకేరోజు 17 కొవిడ్ మరణాలు
జగిత్యాల జిల్లాలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. నిన్న ఒక రోజే 17 మంది మృతి చెందటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
17 dead
మెట్పల్లిలో 59, మల్యాలలో 46, కోరుట్లలో 43, రాయికల్లో 35, మల్లాపూర్లో 22 పాజిటివ్ కేసులు నిర్ధరణ కాగా.. ఇతర మండలాలతో కలుపుకుని మొత్తం 625 కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించటంతో జిల్లా ప్రజలను భయందోళనకు గురవుతున్నారు.కేసుల సంఖ్య పెరగటంతో ప్రజలు మాస్కులను 90 శాతం ఉపయోగిస్తున్నారు.
ఇదీ చదవండి:ఈ మూడు వారాలు జర భద్రం: సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్మిశ్రా
Last Updated : Apr 20, 2021, 6:00 PM IST