ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించారు. బాల్క సురేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంట రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. సురేశ్ చిత్రపటానికి నివాళులర్పించి బాల్క సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ బయలుదేరారు.
సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులు