తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్టీల పేరుతో హమాలీలకు టోకరా.... - MONEY FRAUD NEWS IN TELANGANA

రోజూ కష్టపడి కూలీ చేసుకుని బతికే హమాలీలను నిలువునా ముంచేశాడు ఓ ప్రబుద్ధుడు. వాళ్లలో ఒకరిగా ఉండి... డబ్బలన్నీ పోగయ్యాక... మొత్తానికి మొత్తం ముఠా కట్టుకుని ఉడాయించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగింది.

CHITTI FRAUD IN JAGITYALA
CHITTI FRAUD IN JAGITYALA

By

Published : Mar 10, 2020, 9:32 AM IST

చిట్టీల పేరుతో హమాలి కూలీలను నిలువునా మోసం చేశాడు ఓ వ్యక్తి. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సంతోష్ అనే వ్యక్తి కొన్ని రోజులు హమాలిగా పనిచేశాడు. యార్డులోని కూలీలతో పరిచయం పెంచుకున్నాడు. చిట్టీల వ్యాపారం మొదలుపెట్టిన సంతోష్... కూలీలందరితో డబ్బులు కట్టించుకున్నాడు. చిట్టీ గడువు ముగిశాక తమ డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశాడు.

గడువు ముగిసినా ఇవ్వడంలేదని ఆరోపిస్తూ 16 మంది కూలీలు పొలీస్​స్టేషన్​లో బాధితులు ఫిర్యాదు చేశారు. పలువురు చిరు వ్యాపారులు కూడా.... తమను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.12 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిట్టీల పేరుతో హమాలీలకు టోకరా....

ఇదీ చూడండి:ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

ABOUT THE AUTHOR

...view details