జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, మల్లాపూర్ మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ముందు భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. పేద ప్రజలకు భారంగా మారనున్న ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని.. జగిత్యాలలో భాజపా ధర్నా
పేదప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఖజానా నింపుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజవర్గంలోని మెట్పల్లి, మల్లాపూర్ మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని.. జగిత్యాలలో భాజపా ధర్నా
ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఖజానాను నింపుకొనేందుకే ఎల్ఆర్ఎస్ అంటూ కుయుక్తులు పన్నుతుందని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం తహశీల్దార్లకు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి:రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!