తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష 25పైసల నాణేలతో మువ్వన్నెల జెండా

పంద్రాగస్టు సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం శ్రీనివాస్ గౌడ్... ప్రత్యేక జాతీయ జెండాను తయారు చేసి ఔరా అనిపించాడు. దాదాపు లక్ష... 25 పైసల నాణేలతో జాతీయ పతాకంతోపాటు జెండా కర్రను తయారు చేశాడు.

By

Published : Aug 15, 2021, 4:38 AM IST

PAISA
PAISA

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన కళాకారుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ 25 పైసల నాణేలతో జాతీయ జెండా తయారు చేసి ఔరా అనిపించాడు. మువ్వన్నెల జెండా తయారీ కోసం దాదాపు లక్ష నాణేలు ఉపయోగించాడు. వీటితో జాతీయ పతాకంతోపాటు జెండా కర్రను తయారు చేశాడు.

నాణేలను ఒక్కొక్కటిగా అతికించి 6.1 అడుగుల ఎత్తు జెండా కర్రను దానికి గద్దెను రూపొందించాడు... దాదాపు 15 రోజుల పాటు శ్రమించి నాణేలతో జాతీయ పతాకాన్ని, జెండాను రూపొందించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఇదీ చూడండి:LIGHTINGS: స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details