జగిత్యాల పట్టణంలోని తులసినగర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్బుతమైన విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని గుండుపిన్నుపై ఇమిడేలా తల్లి తన బిడ్డను మోకాలుపై ఆడిస్తున్నట్లుగా ఓ కళాఖండాన్ని రూపొందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
సూక్ష్మకళతో ఆకట్టుకుంటున్న జగిత్యాల వాసి - jagtial district latest news
తల్లి బిడ్డను ఆడిస్తున్నట్లుగా గుండు పిన్నుపై విగ్రహాన్ని తయారు చేశాడు జగిత్యాల పట్టణంలోని ఓ వ్యక్తి. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మగొప్పతనాన్ని తెలిపేలా ఆ బొమ్మను రూపొందించానని ఆయన పేర్కొన్నాడు.
![సూక్ష్మకళతో ఆకట్టుకుంటున్న జగిత్యాల వాసి mothers day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11683302-1011-11683302-1620455769918.jpg)
jagityala news
సూక్ష్మకళతో ఆకట్టకుంటున్న జగిత్యాల వ్యక్తి వ్యక్తి
నైలాన్ వైర్, కలర్ను వాడుతూ.. గుండుపిన్నుపై విగ్రహాన్ని రూపొందించడానికి తనకు 8 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ సూక్ష్మ విగ్రహాలు, వస్తువులను తయారు చేస్తున్నానన్న ఆయన అమ్మ గొప్పతనాన్ని తెలిపేలా ఈ కళాఖండాన్ని రూపొందించానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:వయసు 70 దాటినవారికి పడకలు గగనమే
Last Updated : May 9, 2021, 6:12 AM IST