జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పంటకు మందులు చల్లుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. నడికుడ గ్రామానికి చెందిన భూక్య రాజ్నాయక్ ఉదయాన్నే పొలంలో మందులు చల్లుతున్నాడు.
పొలం మధ్యలో తెగిపడి ఉన్న కరెంట్ తీగలు అతనికి తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.