తెలంగాణ

telangana

ETV Bharat / state

గొంతులో సపోటా గింజ ఇరుక్కుని బాలుడు మృతి

అభం, శుభం తెలియని ఓ బాలుడు... ఇంట్లో ఉన్న సపోటా పండును చూసి వెంటనే తినే ప్రయత్నం చేశాడు. ఆ పండులోని గింజ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక బాలుడు మరణించాడు.

By

Published : Feb 12, 2020, 3:53 PM IST

A boy trapped in the throat killed a sapota nut in jagityala district
గొంతులో సపోటా గింజ ఇరుక్కుని బాలుడు మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. మల్లాపూర్​ మండల కేంద్రానికి చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్‌ సౌదీలో పనిచేస్తున్నాడు. సుజాత బీడీ కార్మికురాలు. ఈమె సోమవారం సాయంత్రం సపోటా పండ్లు కొని ఇంట్లో ఉంచింది.

రెండో కుమారుడు శివకుమార్‌(4) సపోటా తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాలుడిని కుటుంబీకులు మెట్‌పల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్‌ కన్నుమూశాడు. బాలుడి మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

గొంతులో సపోటా గింజ ఇరుక్కుని బాలుడు మృతి

ఇదీ చూడండి:తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details