జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు లింగారెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం లింగారెడ్డి తన ఇంటి సమీపంలో కూర్చొని ఉండగా 20 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి.
మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడిపై 20 మంది దాడి - attack on Congress leader in Metpalli latest news
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![మెట్పల్లిలో కాంగ్రెస్ నాయకుడిపై 20 మంది దాడి 20 Members attack on Congress leader in Metpalli, Jagittala District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9303865-472-9303865-1603596581610.jpg)
కాంగ్రెస్ నాయకుడిపై 20మంది దాడి
క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడం వల్ల వైద్యులు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించారు.
కాంగ్రెస్ నాయకుడిపై 20మంది దాడి
కాంగ్రెస్ నాయకుడిపై 20మంది దాడి