తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

తమ పెద్దమ్మతో కలిసి పెళ్లి చూపులకని ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో లారీ ఢీకొట్టి పెద్దమ్మతో సహా అక్కడిక్కడే మృతి చెందాడో యువకుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగింది.

By

Published : Oct 11, 2019, 3:46 PM IST

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుజ్జేటి గణేష్... తన పెద్దమ్మ లక్ష్మితో కలిసి మెట్​పల్లికి పెళ్లిచూపుల కోసం వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన లారీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వీరి పైనుంచి వెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మి మృతదేహం నుజ్జునుజ్జయిపోయింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ప్రమాద ఘటనతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించి... అనంతరం మృతుల వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

For All Latest Updates

TAGGED:

pramadham

ABOUT THE AUTHOR

...view details