తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్​: పురపోరులో సత్తా చాటనున్న యువత - పురపోరు

పురపాలక ఎన్నికలపై యువత దృష్టిసారించింది. అభివృద్ధి చేసేవారికే ఓటేస్తామని స్పష్టం చేయటమే కాదు... ప్రజలను సైతం చైతన్యపరుస్తోంది. ఈనెల 22న జరగనున్న 9 నగరపాలకసంస్థలు, 120 పురపాలకసంస్థల ఎన్నికల్లో యువకుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. పురపోరులో తీవ్ర ప్రభావం చూపనున్న యువ ఓట్లపై అభ్యర్థులు సైతం ఫోకస్​ చేశారు.

YOUTH VOTES WILL EFFECT IN MUNICIPAL ELECTIONS
YOUTH VOTES WILL EFFECT IN MUNICIPAL ELECTIONS

By

Published : Jan 21, 2020, 9:41 AM IST

బస్తీమే సవాల్​: పురపోరులో సత్తా చాటనున్న యువత

హైదరాబాద్​కు కూతవేటు దూరంలో ఉన్న చాలా మున్సిపాలిటీలు, నగరపాలకసంస్థలు అభివృద్ధికి మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఈ దుస్థితికి ప్రధాన కారణం... ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం... ఆ తర్వాత విస్మరించటమేనని యువత భావన. ఈసారి మాత్రం ఎవరైతే అభివృద్ధి, రక్షణకు పెద్ద పీఠ వేస్తారో వారికే పట్టం కడుతామంటున్నారు యువకులు.

భద్రత కల్పిస్తేనే ధైర్యం...

భాగ్యనగర శివారులో ఉన్న పురపాలికల్లో ఎక్కువశాతం ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు నివాసముంటున్నారు. రాత్రి వేళల్లోనూ విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఎక్కువగానే ఉంటారు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి వసతులతో పాటు పోలీసుల నిఘా పెంచాలని ఆయా ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

పురపోరులో సత్తా చాటనున్న యువత

సరైన నాయకున్ని ఎన్నుకునేలా...

ప్రస్తుతం జరగనున్న పురపాలక సంఘ, నగరపాలక సంఘ ఎన్నికల్లో సరాసరి 40శాతం మంది యువ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా ఇంటింటికి తిరిగి ఓటు విలువ తెలియజేశారు. ఎటువంటి వారికి ఓటేయాలో అవగాహన కల్పించారు. అభివృద్ధి కల్పించే వారిని ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరిచారు.

యువతపై నేతల దృష్టి...

ప్రజాప్రతినిధులు సైతం యువతను ఆకట్టుకునేందుకు ప్రచార పర్వంలో తీవ్రంగా ప్రయత్నించారు. యువతకు కావాల్సిన క్రీడాస్థలాలు, జిమ్​లు, స్కిల్ డెవలప్​మెంట్ కార్యక్రమాల వంటి అంశాలను ప్రస్తావించారు. ఏది ఏమైనా... ఈసారి ఎన్నికల్లో యువత ఓట్లే తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్​ఫోన్​తో ఇస్మార్ట్ ప్రచారం..

ABOUT THE AUTHOR

...view details