తెలంగాణ

telangana

టిక్​టాక్​ వైపరీత్యం: నాలుగు రోజుల పాటు ఇంటికే రాని యువకులు

By

Published : Jun 23, 2020, 5:59 PM IST

'టిక్​ టాక్' మోజులో పడి ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వెళ్ళిన ఐదుగురు యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందమైన లోకేషన్లలో వీడియోలు తీసుకుని... టిక్​టాక్​లో పోస్ట్ చేసేందుకు ఆ యువకులు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ గుంటూరు జిల్లాకు చేరుకున్నారు.

Youth Gets Arrested in Mangalgiri for Roaming on Bikes for Different Locations in Andhra Pradesh
టిక్​టాక్​ వైపరీత్యం: నాలుగు రోజుల పాటు ఇంటికే రాలేదు

'టిక్​ టాక్​' మోజులో పడి ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వెళ్ళిన ఐదుగురు యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందమైన లోకేషన్లలో వీడియోలు తీసుకునేందుకు కాకినాడ, మాడుగుల, నగరం గ్రామాలకు చెందిన ఐదుగురు యువకులు... నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. మార్గమధ్యంలో వివిధ ప్రాంతాలలో వీడియోలు తీసుకున్నారు.

అయితే ఈ విషయం తెలియని తల్లిదండ్రులు... తమ పిల్లలు కనిపించడం లేదని తూర్పు గోదావరి జిల్లా నగరం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతోన్న యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మంగళగిరి ఠాణా నుంచి నగరం పోలీసులకు సమాచారమివ్వగా... వాళ్లు వచ్చి యువకులను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి :బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

ABOUT THE AUTHOR

...view details