తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతురాలి ఖననాన్ని అడ్డుకున్న యువకులు - రేగాటిపల్లి కరోనా వార్తలు

కరోనాతో మృతి చెందిన వారి అంతిమసంస్కారాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొవిడ్​తో చనిపోయిన ఓ వృద్ధురాలి మృత దేహాన్ని తమ స్థలంలో ఖననం చేయ్యెద్దంటూ పెద్ద ఎత్తున ఆ గ్రామ యువకులు ఆందోళన చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

young-man-tried-to-block-burial-of-old-lady-who-died-with-corona-in-regatipalli
కరోనా మృతురాలి ఖననాన్ని అడ్డకున్న యువకులు

By

Published : Jul 8, 2020, 12:09 PM IST

Updated : Jul 8, 2020, 12:28 PM IST

కరోనాతో వృద్ధురాలు చనిపోయింది... ఆమెను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని యువకులు పెద్ద ఎత్తున హల్​చల్ చేశారు. మేము బతకాలా వద్దా అంటూ అంబులెన్స్​ సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని అంతిమ సంస్కారాలు సాఫీగా జరిగేటట్లు చూశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రేగాటిపల్లిలో జరిగింది.

అసలు జరిగింది ఇదీ..

ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు రేగాటిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. తమ ప్రాంతంలో కరోనా మృతురాలిని ఖననం చేయటానికి వీళ్లేదంటూ రేగాటిపల్లి యువకులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతానికి మృతదేహాన్ని ఎందుకు తీసుకువచ్చారంటూ, అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరంటూ అంబులెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులను అక్కడ నుంచి చెదరగొట్టారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య ఖననం చేశారు.

కరోనా మృతురాలి ఖననాన్ని అడ్డకున్న యువకులు

ఇదీ చదవండి:రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు

Last Updated : Jul 8, 2020, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details