తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2020, 10:59 PM IST

ETV Bharat / state

సెల్ఫీ తీసుకుంటూ జారిపడి.. యువకుడు మృతి!

జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. మృతుడు హైదరాబాద్​కు చెందిన రాణాప్రతాప్ గా గుర్తించారు.

young man died falls into waterfall while taking selfie in vishakapatnam
సెల్ఫీ తీసుకుంటూ జారిపడి.. యువకుడు మృతి!

విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలం తాటిగూడ జలపాతం వద్ద విషాదం జరిగింది. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడిన పువ్వుల రాణాప్రతాప్ (22) అనే యువకుడు బలమైన గాయం తగలడం వల్ల మృతి చెందాడు.

మృతుడు హైదరాబాద్‌ యూసఫ్‌గూడ లక్ష్మీనరసింహనగర్‌ వాసిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. జలపాతం చూసేందుకు ఐదుగురు బీటెక్ విద్యార్థులు కారులో విశాఖకు వచ్చినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details