తెలంగాణ

telangana

మూడు రాజధానులపై పునరాలోచన అవసరం: వైకాపా ఎంపీ

By

Published : Aug 11, 2020, 8:30 PM IST

ఏపీ రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు, మహిళలు ఆందోళన చెందవద్దని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయం మీ పక్షాన ఉందని.. 3 రాజధానుల శంకుస్థాపన వాయిదా పడిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్​ 3 రాజధానులపై పునరాలోచన చెయ్యాలని కోరారు.

mp raghu ramakrisnhna raju
'గాంధేయ మార్గంలో పోరాడండి.. ఆందోళన వద్దు'

ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందవద్దన్నారు. న్యాయం మీ పక్షాన ఉందని.. గాంధేయ మార్గంలో ఆందోళన చెయ్యండి తప్ప.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదనడం అసంబద్ధ వాదన అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా 3 రాజధానులపై పునరాలోచన చేయాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

'గాంధేయ మార్గంలో పోరాడండి.. ఆందోళన వద్దు'

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details