యువ రచయితలకు ఆదర్శం
తెలుగు పాటకు పట్టం
ఆయన కలం కదిలిస్తే చందమామ వెన్నెలంత హాయిగా ఉంటుంది. తన సాహిత్యంతో జగమంత కుటుంబంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. "విధాత తలపున ప్రభవించినది" అంటూ మొదటి పాటతోనే సంగీత ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో సినీ రచయితల సంఘం ఆయనను ఘనంగా సన్మానించింది.
సిరివెన్నెల
సిరివెన్నెల యువ రచయితలకు ఆదర్శమని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరెన్నో జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి :జడ్పీ రిజర్వేషన్లు ఖరారు