తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య - hyderabad latest news

అంతా కూతురే అనుకుంది. ప్రాణం పెట్టి పెంచుకుంటోంది. ఆమె చిన్న చిన్న మాటలే వారికి మహా ఆనందం. అంత బాగుందనుకున్న సమయంలో ఆ చిన్నారి మరణం ఆమెకు గర్భశోకం మిగిల్చింది. కూతురి మృతిని తట్టుకోలేక ఆ తల్లి ప్రాణాలు తీసుకుంది.

కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

By

Published : Nov 7, 2019, 1:16 PM IST

Updated : Nov 7, 2019, 1:43 PM IST

హైదరాబాద్​ సీతాఫల్​మండిలో మంజు దంపతులు నివాసముంటున్నారు. వారికి 12 ఏళ్ల పాప ఉంది. నిన్న ఉదయం పాఠశాలకు పంపించే సమయంలో కూతురు ఆరోగ్యం బాగోలేక ఇంటి దగ్గరే ఉంచుకుంది. ఇంట్లోనే ఉన్న చిన్నారి... కడుపు నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందింది.

బిడ్డ మరణాన్ని తట్టుకోలోని మంజు ఇవాళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు

Last Updated : Nov 7, 2019, 1:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details