హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్లో వీడియో ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేశామని ద.మ.రైల్వే ప్రకటించింది. నిర్భయ నిధులను ఉపయోగించి.. రైల్టెల్ కార్పొరేషన్ 24 గంటలు పనిచేసే 20 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అందరూ మహిళా ఉద్యోగులే ఉన్న బేగంపేట రైల్వే స్టేషన్కు ఈ రకమైన వ్యవస్థను ఏర్పాటు చేయండం వల్ల మరింత ప్రత్యేకతను, రక్షణను అందిస్తుందని రైల్వేశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బేగంపేట రైల్వేస్టేషన్లో మహిళల భద్రతపై నిఘా వ్యవస్థ - మహిళల రక్షణ
అందరూ మహిళా ఉద్యోగులే ఉన్న హైదరాబాద్లోని బేగంపేట రైల్వేస్టేషన్లో రక్షణను అందించే కొత్త నిఘా వ్యవస్థను ద.మ. రైల్వే ఏర్పాటు చేసింది.
![బేగంపేట రైల్వేస్టేషన్లో మహిళల భద్రతపై నిఘా వ్యవస్థ women-special-safety-arrangements-in-hyderabad-railway-station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5335984-386-5335984-1576042591935.jpg)
బేగంపేట రైల్వేస్టేషన్లో మహిళల భద్రతపై నిఘా వ్యవస్థ
TAGGED:
మహిళల రక్షణ