తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2020, 1:39 PM IST

ETV Bharat / state

20 రోజుల్లోనే.. 1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు: కేటీఆర్

20 రోజుల్లోనే గచ్చిబౌలిలో 1,500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అమలు చేస్తోందని మంత్రి అన్నారు.

TIMES set up with 1500 beds says KTR
1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు

హైదరాబాద్​ గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1,500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ చికిత్స కోసం 8 ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరోనాపై నెల రోజులుగా చేస్తున్న పోరులో అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజల్లో విశ్వాసం నింపుతున్నామని ఉద్ఘాటించారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అమలు చేస్తోందని మంత్రి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details