తెలంగాణ

telangana

ETV Bharat / state

PV SINDHU: ఒలింపిక్​లో తెలుగు తేజం... సింధుపై ప్రశంసల వర్షం - పీవీ సింధుకు శుభాకాంక్షల వెల్లువ

విశ్వక్రీడల్లో పతకం నెగ్గిన తెలుగుతేజంపై ప్రశంసల జల్లు కురస్తోంది. రెండు ఒలింపిక్స్‌(Olympic) క్రీడల్లో వరుసగా పతకాలు(MEDALS) సాధించిన సింధు(PV SINDHU)కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టోక్యో(TOKYO) ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం కైవసం చేసుకుంది.

wishes to badminton champion pv sindhu, sindhu record
పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ, ఒలింపిక్స్‌లో సింధు విజయం

By

Published : Aug 1, 2021, 7:29 PM IST

Updated : Aug 1, 2021, 8:57 PM IST

టోక్యో ఒలింపిక్స్‌(TOKYO OLYMPICS)లో తెలుగు తేజం పీవీ సింధు(PV SINDHU) కాంస్య(BRONZE) పతకం సొంతం చేసుకుంది. వరసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి సింధు రికార్డు నెలకొల్పింది. రియో ఒలిపింక్స్‌లో రజతం సాధించిన సింధు.. ఈసారి కాంస్యం దక్కించుకుంది. రెండు విశ్వ క్రీడల్లో పతకాలను సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

రికార్డు సింధూరం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పీవీ సింధుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(KISHAN REDDY) అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.

ప్రశంసల జల్లు

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును సీఎం కేసీఆర్(CM KCR) అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధును క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌(SRINIVAS GOUD) అభినందించారు. రెండు వరుస పథకాలతో చరిత్ర సృష్టించారని కొనియాడారు.

గర్వకారణం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకి గవర్నర్ తమిళిసై(TAMILISAI) శుభాకాంక్షలు తెలిపారు. రెండు ఒలింపిక్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలుగు తేజం విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.

తొలి మహిళా క్రీడాకారిణి

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(REVANTH REDDY) అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణి అని... ఈ పథకాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు.

శెభాష్ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(BANDI SANJAY) శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం గెలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధుకు బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో వరుసగా పతకం సాధించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు.

ముద్దుబిడ్డ

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అభినందించారు. వరుసగా రెండు సార్లు పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఆడబిడ్డలు పురస్కారాలు తీసుకొస్తున్నారని.. ఇది దేశానికే గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

Last Updated : Aug 1, 2021, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details