ఏడు నెలల తరవాత నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల అవుట్ పేషెంట్(ఓపీ) విభాగాలు రద్దీగా కన్పిస్తున్నాయి. చలికాలం వైరస్ వ్యాప్తికి మరింత అనువుగా ఉంటుందని ఓ వైపు నిపుణులు చెబుతున్నా ఓపీ కార్డు తీసుకునే దగ్గర నుంచి వైద్యుణ్ని సంప్రదించడం.. ఔషధాలు ఇచ్చేచోట, పరీక్షలు చేసే ప్రాంతాల్లో రోగులు గుంపు గుంపులుగా ఉంటున్నారు. ఎక్కడా కరోనా నిబంధనలు మచ్చుకైనా కానరావడంలేదు. కొందరు రోగులు పేరుకే మాస్క్లు ధరించి, గడ్డం మీదకు లాగేస్తున్నారు. ఎడం అనేది ఎక్కడా పాటించడంలేదు. జ్వరం, దగ్గు, జలుబున్నా సరే... ఒకే లైనులో వెళ్లి ఓపీ చీటీలు తీసుకుంటున్నారు. కరోనా బాధితుల్లో దాదాపు 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు బయటకు కన్పించవు. ఇలాంటి వారూ ఇతర ఇబ్బందులతో ఆసుపత్రికి వస్తున్నారు. ఏ ఒక్కరికి కరోనా ఉన్నా.. ఇతరులకు సులువుగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నిర్లక్ష్య ధోరణి పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉస్మానియా ఆసుపత్రి:
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలకు ఉస్మానియా ఆసుపత్రి ఒక్కటే అందుబాటులో ఉంది. నిత్యం ఇక్కడకు 1500 మందిపైనే రోగులు వస్తున్నారు. 50-80 వరకు సర్జరీలు జరుగుతున్నాయి. ఓపీ నుంచి పరీక్ష కేంద్రాల వరకు అన్ని విభాగాలు రద్దీగా ఉంటున్నాయి. ఒకర్నొకరు నెట్టుకునే పరిస్థితి నెలకొంటోంది. వరండాలు, గదులు ఇరుకిరుగ్గా ఉంటున్నాయి. గాలి, వెలుతురు వచ్చే పరిస్థితి లేదు. మాస్క్లు సరిగా ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలే ఎక్కువ.
నిలోఫర్ ఆసుపత్రి: