తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 12:08 PM IST

ETV Bharat / state

బంగారు గచ్చిబౌలి కోసం పనిచేస్తా: సాయిబాబా

గచ్చిబౌలిలో గత ఐదేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని డివిజన్​ తెరాస అభ్యర్థి సాయిబాబా తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలని.. పెండింగ్​ సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

GACHIBOWLI TRS CANDIDATE
బంగారు గచ్చిబౌలి కోసం పనిచేస్తా: సాయిబాబా

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయని గచ్చిబౌలి తెరాస అభ్యర్థి సాయిబాబా ధీమావ్యక్తం చేశారు. గత ఐదేళ్ల కాలంగా డివిజన్​ పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

లింక్​ రోడ్ల నిర్మాణం చేపట్టామని, మిషన్​ భగీరథతో నీటి సమస్య తీర్చామన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే.. పెండింగ్​ సమస్యల పరిష్కారంతో పాటు.. బంగారు గచ్చిబౌలి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

బంగారు గచ్చిబౌలి కోసం పనిచేస్తా: సాయిబాబా

ఇవీచూడండి:'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

ABOUT THE AUTHOR

...view details