రాష్ట్రంలో పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్ - కేటీఆర్ ట్విట్టర్ తాజా వార్తలు

20:16 November 05
రాష్ట్రంలో పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్
రాష్ట్రంలోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ పెట్టుబుడులు పెట్టాయి. త్వరలో రాష్ట్రంలోకి మరిన్ని కీలక పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం కీలక ప్రకటన చేయనున్నారు.
ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడుల అంశంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రకటన చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్ చుట్టూ ఐటీ క్లస్టర్ల ఏర్పాటు: మంత్రి కేటీఆర్