పచ్చని కాపురంలో కొత్తగా కొన్న సెల్ఫోన్ చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య రేగిన వివాదంతో... వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరులో జరిగింది.
పార్వతి భర్త నాగరాజు మూడు రోజుల కిందట 15 వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడు. అది చెడిపోవడంతో మరమ్మతు కోసం భార్యను డబ్బులు అడిగాడు. లాక్డౌన్ కారణంగా ఇళ్లు గడవడం కష్టంగా ఉందని.. సెల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే ఎలా అని భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.