సాధారణంగా చేపలు నలుపు, తెలుపు మేళవించిన వర్ణంలో కనిపిస్తుంటాయి. ఏపీోలని కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లికి చెందిన బత్తిన శివనాగరాజు తన రెండెకరాల చెరువులో సాగు చేసిన కట్ల రకం చేపలను పెంచారు. అందులో ఒక చేప పూర్తిగా తెల్లరంగులో ఉండి ఆకట్టుకుంది.
జన్యులోపంతో పుట్టిన చేప.. ఎక్కడో చూద్దాం పదండి
ఆక్వేరియాలలో మాత్రమే మనం తెల్ల చిన్న చిన్న చేపలు చూస్తుంటాం కదా! కానీ ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లిలో ఓ చేప జన్యులోపంతో తెల్లగా కనిపించింది.
జన్యులోపంతో పుట్టిన చేప.. ఎక్కడో చూద్దాం పదండి
జన్యుపరమైన లోపంతో ఏర్పడిన అల్బినో అనే వ్యాధి వల్ల ఇలా తెల్లగా మెరుస్తుందని, సూర్యకాంతిని తట్టుకోలేదని కైకలూరు మత్స్యశాఖ ఏడీ వర్ధన్ తెలిపారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు