సేవ్ వాటర్ నినాదంతో 'వీల్థాన్'
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే ఫిట్ ఇండియా తయారవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్వహించిన వీల్థాన్, మారథాన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుభాష్ రెడ్డి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. నీటిని కాపాడు కోవాలనే అవగాహనతో సైకిల్ తాన్ నిర్వహించిన డీపీఎస్ యజమానాన్ని ఎమ్మెల్యే అభినందించారు. తమ పాఠశాలలో విద్యతోపాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని డీపీఎస్ ఛైర్మన్ కొమురయ్య తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి దినకర్ బాబు, మౌంటైనేర్ జాహ్నవి పాల్గొన్నారు.
'Wheel Than' with Save Water slogan
.