రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
బీ అలర్ట్: రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు - సమ్మర్ వార్తలు
రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆర్తనం బలహీన పడిందని... రాగల మూడురోజులు పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపింది.
![బీ అలర్ట్: రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు weather-report-for-next-three-days-in-telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11436225-thumbnail-3x2-summer.jpg)
రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం బలహీనపడినట్లు తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి... మరట్వాడా, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉన్నట్లు వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.