తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటరు ముసాయిదా జాబితా విడుదల - ఓటరు ముసాయిదా జాబితా విడుదల

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ముసాయిదా జాబితా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. 18ఏళ్లు నిండిన వారందరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

voter list release in telangana
ఓటరు ముసాయిదా జాబితా విడుదల

By

Published : Dec 16, 2019, 8:58 PM IST

Updated : Dec 16, 2019, 11:04 PM IST

ఓటరు ముసాయిదా జాబితా విడుదల

రాష్ట్రంలోని 33 జిల్లాల ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 2020 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికన ముసాయిదా జాబితా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్ సైట్ అయిన www.ceotelangana.nic.inలో శాసనసభ నియోజకవర్గాల, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా పొందుపరిచారు. ముసాయిదా జాబితాపై వచ్చే నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా

అభ్యంతరాలను జనవరి 27న పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తైంది. 105 కొత్త పోలింగ్ కేంద్రాలు సహా రాష్ట్రంలో 34,707 పోలింగ్ కేంద్రాలున్నాయి.

జనవరి ఒకటో తేదీ

2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండే వారందరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కోరారు. అందరూ జాబితాలో తమ పేర్లు, వివరాలు సరిచూసుకోవాలని, అవసరమైతే సరిచేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

Last Updated : Dec 16, 2019, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details