తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధ్యత: అంతిమయాత్రలో సామాజిక దూరం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ఎవరూ చెప్పినా.. చెవికి ఎక్కడం లేదు. ఏమవుతుందిలే అని చాలా మందికి నిర్లక్ష్యం. కానీ ఏపీలోని విశాఖ జిల్లాలో మృతిచెందిన ఓ వ్యక్తి అంతిమ యాత్రలో గ్రామస్థులు సామాజిక దూరం పాటించి.. ఆదర్శంగా నిలిచారు.

By

Published : Mar 29, 2020, 6:50 AM IST

social distance
బాధ్యత: అంతిమయాత్రలో సామాజిక దూరం

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామస్థులు... అంత్యక్రియల్లోను సామాజిక దూరం పాటించారు. కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తలు పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన సాయమ్మ గుండెపోటుతో మృతి చెందగా... అందరూ దూరంగా ఉంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.

బాధ్యత: అంతిమయాత్రలో సామాజిక దూరం

ABOUT THE AUTHOR

...view details