ఏపీలోని విశాఖ నుంచి తెలంగాణ వచ్చే బస్సుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరిన మేరకు.. సోమవారం నుంచే విశాఖ ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి, విజయవాడ - సూర్యాపేట మీదుగా హైదరాబాద్కు... అలాగే నర్సీపట్నం, చింతపల్లి, సీలేరు మీదుగా భద్రాచలానికి బస్సులు నడుపుతున్నారు. ఇక పక్కనే ఉన్న ఒడిశాకు సైతం సర్వీసులు తిప్పుతున్నారు. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న మేరకు.. అంతర్ రాష్ట్ర సర్వీస్లలో ఆకుపెన్సీ రేట్ (సీట్లు నిండుతున్న శాతం) పెరుగుతోంది.
విశాఖలో పెరుగుతున్న ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులు
ఏపీలోని విశాఖ ఆర్టీసీ అంతర్ రాష్ట్ర సర్వీసులను క్రమంగా పెరుగుతున్నాయి. ప్రయాణికుల తాకిడి ఉండటంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేట్ (సీట్లు నిండుతున్న శాతం) పెరుగుతోంది. ఒక్క ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి 28కి పైగా అంతర్ రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నారు.
ఏపీలోని విశాఖలో పెరుగుతున్న అంతర్ రాష్ట్ర సర్వీసులు
ఒక్క ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచే 28 కి పైగా అంతరాష్ట్ర సర్వీసులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు వినియోగించుకునే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. అలాగే.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మున్ముందు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులు పెంచుతామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ముకుంద్రెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ