తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్వతీ పుత్రునికి అగ్నిమాపక యంత్రంతో నిమజ్జనం - idol

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరంలో వినూత్నంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. అగ్నిమాపక యంత్రం సాయంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేశారు.

నిమజ్జనం

By

Published : Sep 12, 2019, 9:04 PM IST

ఆంధ్రప్రదేశ్​ విజయనగరంలోని ఏడు కోవెళ్ల ప్రాంగణంలో నెలకొల్పిన మట్టి వినాయకున్ని అదే చోట నీటితో నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకున్ని ఆలయ కమిటీ వారు ప్రతిష్ఠించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు అందించారు. చివరి రోజు ఘనంగా అభిషేకాలు నిర్వహించి.. ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు. అగ్నిమాపక యంత్రంతో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొని తిలకించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మట్టితో వినాయకున్ని రూపొందించి.... ఇక్కడే నిమజ్జం చేశామని ఏడు కోవెల ప్రధాన అర్చకుడు తెలియచేశారు.

నిమజ్జనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details