తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​ అధికారులకు విజిలెన్స్​ నోటీసులు - nims

హైదరాబాద్​లోని నిమ్స్ ఆసుపత్రిలో కొనుగోళ్ళకు సంబంధించి అవకతవకలపై సమాధానం ఇవ్వలంటూ విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రోగుల మంచాలు, ఔషదాల కొనుగోలు, మొదలగు అంశాలపై 34 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావాళిని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మరో వైద్యుడు నిమ్మ సత్యనారాయణకు పంపించారు.

నిమ్స్​

By

Published : Aug 21, 2019, 9:54 AM IST

నిమ్స్​ అధికారులకు విజిలెన్స్​ నోటీసులు

రోగుల మంచాలు, ఔషదాల కొనుగోళ్లలో అవకతవకలపై హైదరాబాద్​ పంజాగుట్టలోని నిమ్స్​ అధికారులకు విజిలెన్స్​ నోటీసులు జారీ చేసింది. 34 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావాళిని నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మరో వైద్యుడు నిమ్మ సత్యనారాయణకు పంపించారు. నాగరాజు పేరుతో నిమ్స్ డైరెక్టర్ నియామకంతో పాటు ఆసుపత్రిలో పెద్ద ఎత్తున నకిలీ వైద్యులు చలామణీ అవుతున్నారని... ఇతర అవినీతి అంశాలపై ఫిర్యాదులు రావడం వల్ల సమాధానం ఇవ్వాలంటూ విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరిన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ బృందం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details