తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.లక్ష కడితే రూ.4 లక్షలు ఇస్తాం.. కేపీహెచ్‌బీలో ఘరానా మోసం.. - XCSPL Company Frauds

Fraud In KPHB: పెట్టుబడులు పేరుతో మరో మోసం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. రూ.లక్ష కడితే ఏడాదికి రూ.4 లక్షలు వస్తాయని ఓ కంపెనీ నమ్మించడంతో అధిక సంఖ్యలో పెట్టుబడుదారులు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తీరా ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటూ.. ఇప్పుడు కేపీహెచ్‌బీలోని కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు.

fraud by XCSPL company
fraud by XCSPL company

By

Published : Feb 15, 2023, 2:56 PM IST

Updated : Feb 15, 2023, 4:13 PM IST

Fraud In KPHB: హైదరాబాద్‌లో ఘరానా మోసాలు రోజుకోకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీలోని ఎక్స్‌సీఎస్‌పీఎల్ అనే సంస్ధ పెట్టుబడుల పేరుతో మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు ఆ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీలో రూ.లక్ష కడితే ఏడాదికి రూ.4 లక్షలు వస్తాయని తమ వద్ద పెట్టుబడులు పెట్టించుకొని ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పేసిందని బాధితులు లబోదిబోమంటూ ఆందోళన చెందుతున్నారు.

అధిక లాభాలు వస్తాయని కంపెనీ చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ సంస్థలో పెట్టుబడి పెట్టామని.. డబ్బు తిరిగి ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేపీహెచ్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంత వరకు ఎంత మంది పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

ఇటీవలే కాలంలో హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. నిందితులు అమాయకపు జనాలను గుర్తించి సైబర్‌, క్రిప్టో కరెన్సీ, అధిక వడ్డీలు ఇలా చాలా రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలోసినీనటులు, క్రికెటర్లతో ప్రకటనల్లో నటించే అవకాశం కల్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

వీరి నుంచి దాదాపు రూ.15లక్షల60వేలు, నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అపూర్వ అశ్విన్ దావా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మాస్టర్స్ పూర్తి చేశాడు. దర్శకత్వం, నటనపై ఇష్టంతో 20 ఏళ్ల పాటు మోడలింగ్‌లో కొనసాగాడు. ప్రముఖనటులు, క్రికెటర్ల ప్రకటనల్లో నటించే అవకాశాలిప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న దంపతుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Last Updated : Feb 15, 2023, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details