తెలంగాణ

telangana

ETV Bharat / state

'నన్ను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం' - వీహెచ్​ హనుమంతరావు

ముఖ్యమంత్రి కేసీఆర్​ విపక్షాలను చూసి భయపడుతున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. తనను సచివాలయం సందర్శనకు అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమంతరావు

By

Published : Jul 1, 2019, 12:09 PM IST

సచివాలయం సందర్శనకు తనను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విపక్షాలను చూసి సీఎం కేసీఆర్​ భయపడుతున్నారని హైదరాబాద్​ సచివాలయం ప్రాంగణం వద్ద ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు మహిళా అధికారిణిపై దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తాను మాజీ ఎంపీగా పార్లమెంటుకైనా వెళ్లగలుగుతానని... సచివాలయంలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్​పై ప్రజలకు నమ్మకం పోతుందని విమర్శించారు.

సీఎం కేసీఆర్​కు విపక్షాలంటే భయం

ABOUT THE AUTHOR

...view details