దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతి లభించింది. తీగల వంతెనపై 40 కిలోమీటర్ల వేగం మించి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. వంతెన అందుబాటులోకి రావడం వల్ల వాహనాలను నిలిపి ఫొటోలు తీసుకుంటున్నారు.
తీగల వంతెనపైకి వాహనాల అనుమతి.. స్పీడ్ లిమిట్ ఎంతో తెలుసా..? - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన తీగల వంతెనపై అధికారులు వాహనాలకు అనుమతిచ్చారు. వంతెనపై 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తీగల వంతెనపైకి వాహనాల అనుమతి
వంతెన పైకి పెద్ద గూడ్స్ వాహనాలు అనుమతించడం లేదు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి 40 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళిన వారికి చలానా విధిస్తున్నారు. వంతెన ప్రారంభం కావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చూడండి;ట్యాంక్బండ్ మరింత అందంగా.. ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
Last Updated : Sep 28, 2020, 1:43 PM IST