తెలంగాణ

telangana

ETV Bharat / state

గణనాథుల యందు ఈ గణనాథుల రూపే వేరయా... - VARIETY_GANESH_AT_BEGAMBAZAR

ఏ రూపంలో తనను ఆరాధించినా... సంతుష్టుడైపోతాడు ఆ భోళా శంకరుని తనయుడు. అందుకేనేమో... ఆధునికతను, సాంకేతికను మేళవించి గణేశుడిని రూపొందించడంలో అన్ని వర్గాలు పోటీ పడుతుంటాయి. కళాకారుల సృజనాత్మక ఆలోచనలతో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు... జంట నగరాల్లో కొలువుదీరాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ బొజ్జ గణపయ్య విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని విగ్రహాల విశేషాలివీ...

భాగ్యనగరంలో కొలువుదీరిన వెరైటీ గణనాథులు

By

Published : Sep 11, 2019, 3:21 PM IST

Updated : Sep 11, 2019, 4:00 PM IST

గణనాథుల యందు ఈ గణనాథుల తీరే వేరయా...

సర్వ విఘ్న హరం దేవం... సర్వ కార్య ఫలప్రదం... సర్వసిద్ధి ప్రధాత.. వందేహం గణనాయకం... ఇలా చాలామంది శ్లోకాలతో బొజ్జ గణపయ్య ప్రార్థనలు చేస్తూ... విభిన్న రూపాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తూ.. భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు కొందరు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి విజ్ఞనాథున్ని కొలుస్తున్న అనేక చారిత్రక మండపాలు నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నాయి.

జంటనగరాల్లో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిపోవటం వల్ల మండపాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మరింత పెరిగినట్లు ఉత్సవ సమితి అంచనా. పాతిక, ముప్పై ఏళ్లుగా వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్న భక్త సమాజాల సంఖ్యకు హైదరాబాద్​లో కొదువలేదు. వాడవాడాలా చాలాచోట్ల వీధికి మూడు నుంచి ఐదు వరకు విగ్రహాలను ఏర్పాటు చేశారు.

విభిన్న ఆకృతుల్లో గణనాథులు

బేగంబజార్, మహారాజ్ గంజ్, న్యూ ఉస్మాన్ గంజ్, గన్ ఫౌండ్రి తదితర ప్రాంతాలలో ఫైలావన్ గణపతి, మూషిక వాహన గణపతి, గజవాహన గణపతి, మయూరంపై గణపతి, హన్​మాన్​పై గణపతి, శివ పార్వతుల మద్య కూర్చున్న గణపతులు కొలువుదీరారు. తిరుమల బాలజీ, నర్సింహాస్వామి సెట్టింహగుతో కూడిన గణపతి, ఐదు నాగసర్పాలపై తాండవం చేస్తున్న శ్రీకృష్ణుడు, రాంమందిర్ సెట్టింగ్​తో కూడిన గణపతి, శంకరుడు తాండవం చేస్తున్న ఇలా అనేక రూపాల్లో స్వామి ప్రతిమలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

గణపతిని ఏ రూపంలో పూజించినా.. ప్రసన్నుడవుతాడని... భక్తుల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఆధునిక, శాస్త్ర సాంకేతిక అంశాలను కూడా జోడించి గణపతి ప్రతిమల్ని తయారు చేస్తున్నట్లు భక్తులు, నిర్వాహకులు చెబుతున్నారు.

12వరకు ప్రదర్శన:

విభిన్న ప్రత్యేకతలతో అలరించే గణపతి విగ్రహాలు ఓ వైపు కాగా.. మండపాలకు విద్యుత్తుదీపాల అలంకరణలు మరోవైపు ఆకట్టుకుంటున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులను అలరింపజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రతిచోటా పెద్దసంఖ్యలో భక్తులు రావడం వల్ల సందడిగా సాగుతున్నాయి. ఈ నెల 12న నిమజ్జనం వరకు విభిన్న రూపాల్లో గణపతులను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

ఇవీ చూడండి: హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన దత్తాత్రేయ

Last Updated : Sep 11, 2019, 4:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details