తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రపతిని కలిసిన ఉత్తమ్​ దంపతులు - Uttam Meet President today news

హైదరాబాద్‌-విజయవాడల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టే అంశమై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను కలిసి  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డిలు విజ్ఞప్తి చేశారు.

Uttam Meet President
Uttam Meet President

By

Published : Dec 27, 2019, 11:39 PM IST

హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్‌ను టీపీసీసీ చీఫ్​ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయవాడ-హైదరాబాద్‌ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య బుల్లెట్‌ రైలు ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజారవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని పేర్కొనగా అందుకు సానుకూలంగా రాష్ట్రపతి స్పందించినట్లు ఉత్తమ్​ తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్వారా... కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. పూర్తి వివరాలతో తనను దిల్లీలో కలువాలని రాష్ట్రపతి సూచించారు. పూర్తి వివరాలతో త్వరలో రాష్ట్రపతిని కలుస్తానని ఉత్తమ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details