తెలంగాణ

telangana

By

Published : May 10, 2021, 2:48 AM IST

ETV Bharat / state

విద్యార్థి సంఘం నేతల అరెస్ట్​ దారుణం: ఉత్తమ్​ కుమార్​

ఎన్​ఎస్​యూఐ విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.

Uttam kumar reddy
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌లో చెరువు శిఖం భూమిని ఆక్రమించి మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాలలు నిర్మించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన ఎన్​ఎస్​యూఐ విద్యార్థులను అరెస్ట్‌ చేయటం దారుణం అన్నారు.

ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, మరికొంత మందిపై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వారిపై అక్రమంగా నిర్భందించారని.. విద్యార్థులకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:బ్యాంక్​ ఉద్యోగులపై కరోనా పంజా.. పనివేళలు కుదించాలని విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details