తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసకు తొత్తులుగా కొందరు ఐఏఎస్​, ఐపీఎస్​లు.. వారికే మంచి హోదాలు'

Uttam Kumar comments On Civil Servants: రాష్ట్రంలో ఐఏఎస్​ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్‌ భ్రష్టు పట్టిస్తున్నారని.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. తమకు అనుకూలంగా ఉండేలా ఇష్టారీతిన అధికారులను నియమించుకుంటున్నారని ఆరోపించారు. తెరాసకు తొత్తులుగా వ్యవహరించేవారికి హోదాలు కల్పిస్తూ అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Jan 30, 2022, 8:05 PM IST

uttam kumar reddy
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

Uttam Kumar comments On Civil Servants: రాష్ట్రంలో సివిల్​ సర్వీస్​ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్‌ భ్రష్ఠు పట్టిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 14 మంది సీనియర్ ఐఏఎస్‌ అధికార్లను పక్కనపెట్టి సోమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడం అక్రమమని ధ్వజమెత్తారు. సోమేశ్​ కుమార్‌ తెలంగాణకు కేటాయించిన అధికారి కాదని... ఏపీకి కేటాయించిన అధికారి అని తెలిపారు. సోమేశ్​పై కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమని ప్రశ్నించారు. 2016 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారులకు రెండేళ్లపాటు పోస్టింగ్‌ ఇవ్వలేదని ఉత్తమ్​ విమర్శించారు.

పార్లమెంట్‌లో తెరాస తీరును ప్రస్తావిస్తా: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

"తెరాసకు అనుకూలంగా ఉండే ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు.. పది, పదిహేను శాఖలు కేటాయించి.. మిగిలిన అధికారులను ఖాళీగా ఉంచి అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల ఎస్పీలు.. అసలు ఐపీఎస్​ చేయలేదు. స్వతంత్రంగా ఉండే వారు కాకుండా ప్రభుత్వం చెప్పినట్లు వినేవారికే హోదాలు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని తన సొంత జాగీరుగా కేసీఆర్​ మార్చుకున్నారు." -ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

కేంద్రం ఐఏఎస్​ బదిలీలను తప్పుబడుతున్న కేసీఆర్‌... రాష్ట్రంలో మాత్రం సరైన విధానాలు అవలంబించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చేందుకు సివిల్​ సర్వీసు అధికారులు వెనకడుగేస్తున్నారని ఉత్తమ్​ ఆందోళన వ్యక్తం చేశారు. తెరాసకు తొత్తులుగా వ్యవహరించే అధికారులకే ప్రభుత్వం మంచి హోదా ఇస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకే రజత్ కుమార్‌కు నీటిపారుదల శాఖలో పోస్టింగ్‌ ఇచ్చారని ధ్వజమెత్తారు. రజత్​ కుమార్​ వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దేశంలో సీఎం కేసీఆర్ చేసిన అవినీతి ఎవ్వరూ చేయలేదని ఆరోపించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్న తీరును పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలకు సీఎస్​ సోమేశ్ కుమార్ అపాయిట్​మెంట్​ కూడా ఇవ్వరని.. రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా సీఎం కేసీఆర్​ భావిస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Mahmood ali on Drugs: 'డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం... మూలాలు లేకుండా చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details